Header Banner

అనంతపురం ఘటనలపై తీవ్ర ఆవేదన, నేరగాళ్లకు వణుకు పుట్టాలి.! పోలీసులకు చంద్రబాబు దిశానిర్దేశం!

  Tue Jun 10, 2025 22:24        Politics

రాష్ట్రంలో మహిళలు, బాలికలపై దాడులకు పాల్పడే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని, గంజాయి ముఠాల ఆగడాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని, వంద శాతం మార్పు కనిపించాలని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఇతర ఉన్నతాధికారులతో శాంతిభద్రతల అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇటీవల అనంతపురం పట్టణంలో ఇంటర్ విద్యార్థిని హత్య, రామగిరి మండలంలో బాలికపై సామూహిక అత్యాచారం, ఏడుగురాళ్లపల్లిలో బాలికపై జరిగిన అఘాయిత్యం ఘటనలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుల పూర్వాపరాలను అడిగి తెలుసుకున్న ఆయన, నిందితులకు తక్షణమే శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..

 

దర్యాప్తును వేగవంతం చేసి, ఛార్జ్‌షీట్ దాఖలు చేసి, ట్రయల్స్ త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. పక్కా ఆధారాలు సేకరించి, నిందితులకు అత్యంత కఠిన శిక్షలు పడేలా చూడాలని తెలిపారు. "ఆడబిడ్డలపై చేయి వేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకురావాలి. నేరం చేయాలనే ఆలోచన ఉన్నవారు పోలీసులు తీసుకునే చర్యల గురించి భయపడే పరిస్థితి రావాలి" అని సీఎం అన్నారు. గత ఐదేళ్లలో నేరగాళ్లపై సరైన నియంత్రణ లేకపోవడం, గంజాయి, డ్రగ్స్ వంటి వాటిపై ఉదాసీనత వల్లే నేరగాళ్లు రెచ్చిపోయారని, ఆ పాత అలవాట్లను కొందరు ఇంకా మానడం లేదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిని నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే ముందస్తుగా అదుపులోకి తీసుకుని హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా, అనంతపురం జిల్లాలో యువతి హత్య ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఘటనపై తీసుకున్న చర్యలను మూడు రోజుల్లోగా నివేదించాలని ఏపీ డీజీపీకి లేఖ రాసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి మండలంలో ఎనిమిదో తరగతి బాలికపై కొన్నేళ్లుగా అత్యాచారం జరుగుతున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు, పరారీలో ఉన్న మిగతా వారిని త్వరలో పట్టుకుంటామని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

 

రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!

 

పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!

 

సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!

 

బాల‌య్య‌కు చంద్ర‌బాబు బ‌ర్త్‌డే విషెస్! సోష‌ల్ మీడియా వేదిక‌గా..

 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు! మొదటి దశకు సుమారు..

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..

 

కృష్ణంరాజు కాదు నికృష్ఠం రాజు.. అతను జర్నలిస్ట్ ముసుగేసుకున్న జగనిస్ట్! వారి బతుకులు రోడ్డుపాలవడం ఖాయం!

 

కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..

 

జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!

 

8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!

 

అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Criminals #Action #ordersStrict